ప్రపంచ దేశాల్లో భారత్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల్గిన దేశం. మిలటరీ పరంగా కూడా నాలుగో స్థానంలోనే ఉంది. టెక్నాలజీ పరంగా ఎంతో మంది భారతీయులు ప్రపంచ దేశాల్లో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఏషియా నేషన్స్లో భారత్ శక్తివంతమైన నేషన్గా అవతరించింది.
అయితే వీటన్నింటిని కీర్తించకుండా పశ్చిమ దేశాలు ఇండియాను ఎప్పుడు ఒక పేద దేశంగా..జనాభా ఎక్కువ కల్గిన కంట్రీగా చూపించడం దారుణం. జర్మనీకి చెందిన ప్రముఖ మ్యాగజైన్ డేర్ స్పేజెల్ కూడా ఇలాగే ఒక కార్టూన్ ప్రచురితం చేసింది. అందులో భారత్ ఒక కిక్కిరిసిన రైలు,చైనా బుల్లెట్ రైల్ మధ్య క్యాంపరిజన్ చేస్తూ కార్టూన్ ప్రచురించింది.
ఈ కార్డూన్ ద్వారా భారత్ ఒక పేద దేశంగా,దేశంలో జనాభా పెరుగుదలను కంట్రోల్ చేయలేని దేశంగా అభివర్ణించేందుకే డేర్ స్పేజేల్ మ్యాగజైన్ ఇలాంటి కార్టూన్ ప్రచురితం చేసినట్లు అర్థమవుతోంది.అయితే ఆ కార్టూన్ ను ప్రదర్శించిన మ్యాగజైన్పై పలువురు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ డేర్ స్పేజెల్ మ్యాగజైన్ యాజమాన్యంపై మండిపడ్డారు. రాబోయే కాలంలో జర్మనీని ఆర్థికంగా అధిగమించి తప్పకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇక వైసీపీ ఎంసీ విజయసాయి రెడ్డి కూడా ఆ కార్టూన్ పై రియాక్ట్ అయ్యారు. పశ్చిమ దేశాలు ఎప్పుడు భారత్ ను చిన్న చూపే చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.