అసలేంటి ఈ ప్రాజెక్టు..?
భారత్లో కేరళ అనేది ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ పశ్చిమ కనుమలు ఉండడం,సముద్ర జలాలు కేరళ రాష్ట్రంలోకి చొచ్చుకురావడంతో ఇక్కడ పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలోనే కేరళ టూరిస్ట్ డెస్టినేషన్స్ ను మరింతగా డెవలప్ చేసేందుకు కోచి వాటర్ మెట్రో సర్వీసు లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రోజులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోచ్చి వాటర్ మెట్రో ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈప్రాజెక్టును కేరళ స్టేట్ గవర్నమెంట్,జర్మనీకి చెందిన కేఎఫ్డబ్యూ కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నా యి.
కోచి వాటర్ మెట్రో సర్వీస్లో బ్యాటరీతో నడిచే 78 హైస్పీడ్ బోట్లను ఈ ప్రాజెక్టులో భాగంగా అందుబాటు లోకి తేనున్నారు. ఈ బోట్లు మొత్తం బ్యాటరీలతోనే నడిచేలా వీటిని రూపొందించనున్నారు. కోచి చుట్టు పక్కలున్న ఐలాండ్స్ ను కోచితో కనెక్ట్ చేసేందుకు ఈ బోట్లు ఉపయోగపడనున్నాయి. ఈ బోట్లు గంటకు 15 నుంచి 22 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. వీటిలో వైఫై సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉండనుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు పూర్తైతే కేరళ రూపురేఖలే మారిపోతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ చెబుతున్నారు. అందుకే మోడీ గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.