
సత్య నాదెళ్ల పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన ఆయన ప్రపంచ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సీఈవో బాధ్యతలు చేపట్టారు. ఆయన లైఫ్ ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తే. ఆయన కెరీర్ లో క్రికెటర్ అవ్వాలని కలలు కన్నా విధి మాత్రం ఆయనను ప్రపంచ మేటి వ్యక్తుల జాబితాలో చేర్చింది. ఆయన లైఫ్ స్ఫూర్తి అయినా ఆయన లగ్జరీ మాత్రం ఎవ్వరికీ దొరకదనే చెప్పాలి. పుస్తకాలతో నిత్యం స్నేహం చేసే ఆయనకు రెండు అంతస్తుల అతి పెద్ద లైబ్రరీనే ఉందంటే పుస్తక జ్ఞానం ఆయనను ఎంత ఉన్నత వ్యక్తిని చేసిందో తెలుస్తుంది.
19 ఆగస్ట్, 1967లో జన్మించిన ఆయన హైదరాబాద్ లోని బేగంపేట పబ్లిక్ స్కూల్ లో చదివారు. ఐఐటీలో చదువుతుండగా ఫెయిల్ అవడంతో 1988లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ సాధించారు. మిస్కాన్ వ్యాలీలోని యూనివర్సీలో కంప్యూటర్ సైన్స్, చికాగో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. మొదట క్రికెటర్ కావాలని చాలా కలలు కన్నాడు. ఎప్పటికీ గ్రౌండ్ లో కసరత్తు చేసేవారు సత్య నాదెళ్ల.
తను అనుకోని విధంగా మైక్రోసాఫ్ట్ సీఈవో పదవికి ఎంపియ్యారు. తర్వాత వివాహం చేసుకున్న ఆయన పిల్లలు దివ్యాంగులుగా పుట్టడంతో చాలా బాధలు కూడా అనుభవించారు. ఇటు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మైక్రోసాఫ్ట్ బాధ్యతలు, అటు పిల్లల ఆరోగ్య పరీక్షలు కొన్నేళ్లు ఆయన సతమతం అయ్యారు. సీఈవో కాగానే ఎన్నో మార్పులు తీసుకచ్చి ప్రతి ఒక్కరి మన్ననలు పొందారు నాదెళ్ల.. ఆయన వివాసవంతమైన లైఫ్ గురించి చూద్దాం..
మైక్రోసాఫ్ట్ సీఈవో అయిన సత్య నాదెళ్ల బెల్లేవ్ లో నివసిస్తున్నారు. ఆయన ఉంటున్న ఇంటి విలువ రూ. 7.5 మిలియన్ డాలర్లు (ఇండియన్ రూపీలో 60 కోట్ల కంటే ఎక్కువే) ఉంటుంది. ఇందులో రెండు ఫ్లోర్ లలో లైబ్రరీ, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ ఫూల్స్, వైన్ సెల్లార్, గేమ్ రూమ్స్ ఇలా అనేక సౌకర్యాలు ఉన్నాయి.






