Daughter loved : పెళ్లీడుకు వచ్చిన కూతురు ఒక వ్యక్తితో తిరుగుతుండడంతో తట్టుకోలేని తండ్రి, సోదరులు ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఆమె అవి పట్టించుకోకుండా ఆయనతోనే తిరుగుతుండడంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు మ్యాటర్ కు ఫుల్ స్టాప్ పెట్టారు ఇంతకీ ఏం చేశారంటే.
దాయాది దేశం పాకిస్తాన్ లో నేరాలు, ఘోరాలు ఎలా జరుగుతాయో మనందరికీ తెలిసిందే. దేశ రాజధాని లాహోర్ కు దాదాపు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న జాంగ్ జిల్లా, హరాజ్ నగర్ ఏరియాలో రజబ్ అలీ నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు.. ఇద్దరు కొడుకులు జబ్బార్ అలీ, అమీర్ అలీ ఉన్నారు. ఇందులో రజబ్ అలీ పద్ద కూతురుకు 20 సంవత్సరాల వయస్సు ఉంటుంది. దాదాపు ఆమె పెళ్లీడుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె తమ ఏరియాలో ఉన్న ఒక యువకుడిని ప్రేమించింది.
తండ్రి, సోదరులు ఇంట్లో లేని సమయంలో సదరు యువకుడితో కలిసి బయటకు వెళ్లేది. ఈ క్రమంలో ఆమె ఒకసారి తండ్రి కంట్లో పడింది. దీనిపై ఆరా తీసిన తండ్రి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ముందు ప్రియుడిని కలవద్దని వారించాడు. కలిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఇంత జరిగినా సదరు యువతి తన ప్రియుడిని కలవడం మాత్రం మానలేదు. దీంతో తను చెప్తే వినడం లేదని తండ్రి కూతురిపై పగ పెంచుకున్నాడు.
కూతురు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుందని బయటపడితే పరువు పోతుందని రజబ్ అలీ రగిలిపోయాడు. రజబ్ఆలీ, అతని కొడుకులు ఇంట్లో బంధించి చిత్ర హింసలు పెట్టారు. పగతో రగిలిపోయిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు గమనించి హాస్పిటల్కు తరలించారు. తన ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి, సోదరులే తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చింది. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.