ఈ రోజుల్లో ఎంత సంపాదించినా చాలడం లేదు. ధరలు పెరుగుదలతో డబ్బు నిలవడం లేదు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తోచడం లేదు. కష్టపడి పనిచేసినా ప్రతిఫలం ఉండటం లేదు. వచ్చిన డబ్బంతా ఖర్చులకే సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో వాస్తు దోషాలు ఏవైనా ఉన్నాయేమోననే అనుమానం అందరిలో కలగడం మామూలే.
వాస్తు ప్రకారం చూస్తే ఇంటి ప్రధాన ద్వారమే మనకు ఆధారంగా నిలుస్తోంది. మంచి జరగాలన్నా చెడు రావాలన్నా మెయిన్ డోరే కీలకం. దీంతో ఇంట్లోకి సానుకూల, ప్రతికూల ప్రభావాలు కలగడానికి కూడా ద్వారమే కారణం. ఇంటి ప్రధాన ద్వారానికి అంతటి ప్రాధాన్యం ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లోకి పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలకు ప్రధాన ద్వారం ద్వారానే జరుగుతాయని నమ్మకం.
బీరువా ఉండే చోటు కూడా వాస్తు దోషాలు తెస్తుంది. ఇది నైరుతి, దక్షిణం మూలకు ఉండటమే శ్రేయస్కరం. ద్వారం తెరిస్తే ఉత్తరం వైపు ఉండాలి. అలా బీరువాను ఉంచుకోవాలి. లేదంటే వాస్తు దోషాలు ఏర్పడితే కష్టాలు వస్తాయి. ధన నష్టం జరుగుతుంది. బీరువాను కూడా ఎప్పుడు సరైన దిశలోనే ఏర్పాటు చేసుకోవడం అన్ని విధాలా మంచిదని గుర్తుంచుకోవాలి.
ఇంటి గోడలకు రంగు కూడా ప్రధానమే. గోడలకు నీలి రంగు వేసుకోవాలి. ఇతర రంగులు వేస్తే దోషాలు వస్తాయి. ఇంకా ఈశాన్యం కూడా బాగా ఉంచుకోవాలి. అటువైపు బరువు పెరగకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో బరువు పెడితే ఆర్థిక ఇబ్బందులు రావడం సహజమే. అందుకే జాగ్ర్త్తత్తగా ఉండకపోతే వాస్తు దోషాలు మరింత కష్టాలు పెట్టడం జరుగుతుంది.