మనకు వెల్లుల్లితో ఎన్నో లాభాలున్నాయి. ఆయుర్వేదంలో దీన్ని మందులా వాడతారు. చాలా రకాల సమస్యలను ఇది నివారిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటారు. వెల్లుల్లితో మనకు దీర్థకాల రోగాలను కూడా నియంత్రించవచ్చు. ఈ నేపథ్యంలో వెల్లుల్లి రెబ్బలతో మనకు కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. దీన్ని తీసుకుని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు.
దీనికి ఏం చేయాలంటే వెల్లుల్లిని బాగా దంచుకోవాలి. ఒక గ్లాసులో పాలు తీసుకోవాలి. అందులో ఒక గ్లాసు నీళ్లు కలుపుకోవాలి. రెండు కలిపి సన్నని సెగ మీద వేడి చేసుకోవాలి. ఓ ఇరవై నిమిషాలు మరిగించాక ఆ మిశ్రమం మళ్లీ గోరువెచ్చగా అయ్యాక వాటిని తాగాలి. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత రోగాలు దూరం అవుతాయి. దీంతో హార్ట్ డిసీజెస్ లేకుండాపోతాయి.
ప్రస్తుత రోజుల్లో మన ఆహార అలవాట్లు మనకు గుండె జబ్బులు రావడానికి కారణమవుతోంది ఈ క్రమంలో రక్తనాళాల్లో పూడికలు వస్తాయి. దీంతో రక్తసరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో వివిధ రోగాలతో బాధపడేవారు ఈ కషాయం మూడు నెలల పాటు తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఓ 15 రోజులు ఆగి మళ్లీ మూడు నెలలు ఇలా తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అధిక బరువును అదుపు చేసి మన శరీరంలో పెరిగిన కొవ్వును మాయం చేస్తుంది.
ఇటీవల కాలంలో మన జీవన శైలి కారణంగా ఒత్తిడులు పెరుగుతున్నాయి. దీంతో మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని దూరం చేసుకునేందుకు రకరకాల పద్ధతులు పాటించాల్సి వస్తోంది. ఇందులో భాగంగానే వెల్లుల్లి రెబ్బలతో పాలు కలుపుకుని తాగడం వల్ల మనకు చాలా రకాల లాభాలుంటాయి.