ఇంగ్లిష్ మందులతో నయం కాని రోగాలు కూడా ఆయుర్వేదంలోని మందులతో బాగవుతాయి. అంతటి శక్తి ఆయుర్వేదానికి ఉంది. అందుకే మన దేశంలో చాలా మంది ఆయుర్వేదాన్ని నమ్మడం సహజమే. ఈ నేపథ్యంలో మనకు దొరికే పండ్లలో కూడా ఔషధ గుణాలు దాగి ఉన్నాయని మన ఆయుర్వేదం చెబుతోంది. భారతీయ ఆయుర్వేదంలో ప్రతి చెట్టు ఓ మందే. కానీ మనకు చాలా విషయాలు తెలియవు. అందుకే ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. మనకు లభించే పండ్లలో కూడా మన రోగాలను నయం చేసే ఔషధ గుణాలు దాగి ఉన్నాయనే విషయం తెలియదు.
ఉసిరికి ఆయుర్వదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. వేదకాలం నుంచి దీంతో అనేక రోగాలను నయం చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మనకు ఎంతో బలం చేకూరుస్తుంది. కఫం, పైత్యం చికిత్సలో దీనికి ప్రత్యేకత ఉంటుంది. ఇందులో క్రోమియం అనే పదార్థం ఉండటం వల్ల కొవ్వును తగ్గిస్తుంది.
ఆపిల్ ను మనం ఇష్టంగా తింటాం. చూస్తేనే నోరూరుతుంది. ఆపిల్ లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు దాగి ఉండటం వల్ల పలు రోగాలకు ఇది మందులా పనిచేస్తుంది. బేరి పండ్లు కూడా మనకు హార్మోన్ల సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పోలేట్, విటమిన్ బి6 వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి.
అంజీర్ పండ్లను అత్తి పండ్లు అని పిలుస్తారు. వీటితో మలబద్ధకం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని మెడిసిన్ గా చెబుతారు. దానిమ్మ పండ్లు కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. తరచుగా వీటిని తింటే పేగుల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలా ఆయుర్వేదంలో పండ్లను మందులుగా వాడుకోవడం మామూలే.