మజ్జిగ
వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి అద్భుతమైన పానీయాల్లో మజ్జిగ మొదటి స్థానంలో ఉంటుంది. ఎండాకాలంలో క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎసిడిటి, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో కాస్త ఎండిన అల్లం లేదా మిరియాలు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.
చెరుకు రసం
ఎండాకాలంలో వేడిని భరించడానికి ఉపయోగించే పానీయాల్లో చెరుకు రసం కూడా ఒకటి. దీంతో పలు రోగాలకు మందులా పనిచేస్తుంది. చెరుకు రసం తరచుగా తీసుకుంటే శరీరానికి చల్లదనం కలుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. చెరుకురసంలో పుదీనా, నిమ్మరసం కలుపుకుని తాగితే బాగుంటుంది.
జీరా డ్రింక్
జీలకర్రతో తయారు చేసే పానీయం ఇది. వేడి నుంచి ఉపశమనం కోసం దీన్ని తయారు చేసుకుంటాం. ఇది శరీరానికి చలువ చేస్తుంది. జీలకర్ర అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటి రాకుండా నిరోధిస్తుంది. గ్లాసు నీటిలో జీలకర్ర వేసుకుని అందులో కాసింత ఉప్పు, కారం చేర్చుకుని తాగితే అధిక వేడి సమస్యను పోగొడుతుంది.
సోంపుతో..
మనం ఆహారం తిన్న తరువాత జీర్ణం కోసం కాసిన్ని సోంపు గింజలు నోట్లో వేసుకుంటాం. దీంతో మనం తిన్న ఆహారం జీర్ణమైపోతుంది. వేసవి కాలంలో సోంపుతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. సోంపు టీ తాగడం వల్ల ఎండ బారి నుంచి రక్షించుకోవచ్చు. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడటానికి కూడా ఇది దోహదపడుతుంది.
పుచ్చకాయ
దీన్ని వాటర్ మిలన్ అని పిలుస్తారు. ఇందులో తొంభైశాతం నీరే ఉంటుంది. అందుకే వేసవి కాలంలో అందరు తినాల్సిన పండు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవి కాలంలో పుచ్చకాయనునేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. దీంతో శరీరం చల్లబడుతుంది. ఎండ వేడిమిని ఇది నివారిస్తుంది. వడదెబ్బ సోకకుండా రక్షణ కల్పిస్తుంది.