
సేంద్రియ పద్ధతులకు డిమాండ్ పెరుగుతోంది. రసాయనిక ఎరువుల ప్రభావంతో మనకు రోగాలు వస్తున్నాయి. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెబుతున్నా అది ఖర్చుతో కూడుకున్నదని భావిస్తున్నారు. దీంతో రసాయనిక ఎరువులే వాడుతున్నారు. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. డిమాండ్ ఉన్నా సాధ్యం కావడం లేదు. దీంతో వ్యయభారం అని భావించి ఎవరు ముందుకు రావడం లేదు.
ఈ నేపథ్యంలో మనం ఉదయం అందరం టీ, కాఫీలు తాగుతుంటాం. అందులో చక్కెర వేసుకుంటాం. చక్కెర వల్ల ఎన్నో రోగాలు వస్తాయని తెలిసినా మానడం లేదు. పలితంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయినా లెక్క చేయడం లేదు. టీ, కాఫీల్లో తాటిబెల్లం వేసుకుని తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది టీల్లో తాటిబెల్లం వేసుకుంటున్నారు.
మామూలు బెల్లం రూ.40 కిలో ఉంటే తాటి బెల్లం రూ. 200 నుంచి 300 వరకు ఉంటుంది. కానీ ఆరోగ్య రీత్యాచాలా మంచిది. అందరు దీన్ని వాడటానికి మొగ్గు చూపుతున్నారు. చక్కెరను దూరం చేయాలని భావిస్తున్నారు. చక్కెర వల్ల ఎన్నో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున దాన్ని విస్మరించాలని చూస్తున్నారు. తాటిబెల్లంతోనే అన్ని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుని ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ప్రాంతాల్లో తాటిబెల్లం విక్రయిస్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున తాటి బెల్లంతోనే ఇక మీదట స్వీట్లు కూడా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందరు కూడా విధిగా తాటిబెల్లం వాడి చక్కెరను దూరం చేయాలని చూస్తున్నారు. దీంతో మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.






