టాలీవుడ్ ఏంటి బాలీవుడ్ లోనే పెద్దగా పరిచయం అక్కర్లేని పేర్లు మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ. ప్రస్తుతం ఆరు పదుల (60) వయస్సు దాటినా యంగ్ హీరోలతో పోటీ పడుతూ మరి సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాలతో కొంత గ్యాప్ తీసుకున్నా.. బాలయ్య మాత్రం నిత్యం తన అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వీరి ఒంటరి సినిమాకే విపరీతమైన హైప్ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకే సినిమా (మల్టీ స్టారర్) తీస్తే ఇటు తెలుగు సినీ ప్రేక్షకులకు అటు వారి అభిమానులకు పండుగే కదా. అలాంటి ఒక మూవీ కూడా ఉందని చాలా మందికి తెలియదు. అదేంటో ఇక్కడ చూద్దాం.
ఈ మధ్య మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. హీరోలు బేషజాలకు పోకుండా మరో హీరో సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇస్తూ సినిమా హిట్ లో వారు సైతం పాలు పంచుకుంటున్నారు. ఈ తరహా ఎన్టీఆర్ కాలంలో కూడా కొనసాగింది. నాలుగు దశాబ్దాల కిందట అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోలు కలిసి నటించారు. ఒకరి సినిమాలో ఒకరు నటించారు. ఇక అందరూ కలిసి ఒకటి, రెండు పౌరాణిక చిత్రాల్లో కూడా కనిపించారు.
1990 వ దశకలంలో హీరోల మధ్య తీవ్రంగా ఇమేజ్ సమస్య మొదలైంది. దీంతో మల్టీ స్టారర్ సినిమాల ప్రసక్తే లేకుండా పోయింది. ఈ తంతును పవన్ కళ్యాణ్ కొంచెం పక్కను నెట్టినట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ వెంకటేష్, వెంకటేశ్, మహేశ్ బాబు కలిసి సినిమాల్లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్, చిరంజీవి రామ్ చరణ్ లాంటి టాప్ హీరోలు కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. అయితే బాలకృష్ణ, చిరంజీవి కూడా ఓ సినిమాలో కనిపించారు. వెంకటేశ్ హీరోగా చేసిన త్రిమూర్తులు చిత్రంలోని ఓ పాటలో మెగాస్టార్, యువరత్న కలిసి కనిపిస్తారు. వీరితో పాటు శోభన్ బాబు, నాగార్జున, కృష్ణ కూడా డాన్స్ చేశారు. ఆ తర్వాత వీరు మరో సినిమాలో కనిపించలేదు.