Nagachithanaya: అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. నిశ్చితార్థం ఫొటోలు బయటకు రాగానే సోషల్ మీడియాలో వీరిద్దరూ ట్రెండిగ్ లో ఉన్నారు. అప్పటి నుంచి వీరిద్దరిపై రోజూ ఏదో వార్త బయటికి వస్తూనే ఉంది. మరో వైపు చైతూ తన సినిమాలతో బిజీగా ఉన్నాడు. నిశ్చితార్థం తర్వాత అటు మీడియా ముందుకు గానీ, ఇటు సోషల్ మీడియాలో గానీ మళ్లీ కనిపించ లేదు చైతూ.
తాజాగా చైతన్య తనకు కాబోయే భార్య శోభితతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు . లిఫ్ట్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలో మోడ్రన్ లుక్ ఆకట్టుకుంటున్నారు. దీనికి ‘ఎవ్రిథింగ్.. ఎవ్రీవేర్.. ఆల్ ఎట్ వన్స్’’ అంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ఫొటోకు కామెంట్స్ ఆప్షన్ లాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చై-శోభితల నిశ్చితార్థం నుంచి కొందరు చైతన్యను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే శోభిత గత చిత్రాల ఫొటోలను షేర్ చేస్తూ సమంత కన్నా తక్కువేం కాదు..అంతకన్నా హాట్ గానే కనిపిస్తున్నది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. సమంత ఏం తప్పు చేసిందని అలా వదిలించుకున్నావు.. ఆమె మానసికంగా కోలుకోలేని విధంగా చేశావంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో సమంతను చై ఫాలోవర్లు కూడా టార్గెట్ చేశారు. ఈ గొడవంతా ఎందుకని చైతన్య కామెంట్స్ ఆప్షన్ ఆఫ్ చేశాడనే చర్చ జరుగుతున్నది.