ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మెల్ బోర్న్ లో ఉంటున్న తెలుగువాళ్లు , ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు , పురుషులు , పిల్లలు , వృద్దులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ” ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ” ఆధ్వర్యంలో జరిగింది. అసోసియేషన్ కార్యవర్గం అనిల్ రెడ్డి , కిరణ్ , ఫణి రంగరాజు , వంశీ రెడ్డి , కిషోర్ , మహేష్ , రవీందర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని జనరంజకంగా నిర్వహించారు.