భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ లు బాలీ వేదికగా ఇండోనేషియాలో సమావేశం కానున్నారు. నవంబర్ 15 , 16 తేదీలలో ఇండోనేషియాలో ” G – 20 ” సదస్సు జరుగనుంది. దాంతో ఈరోజు నవంబర్ 14 నే ఇండోనేషియాకు వెళ్లనున్నారు భారత ప్రధాని మోడీ. జి – 20 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ వ్యాప్తంగా పలు అగ్ర దేశాల నేతలు పాల్గొననున్నారు దాంతో పలు దేశాల అధినేతలతో మోడీ సమావేశమౌతారు.
ఇక అందులో భాగంగానే బ్రిటన్ కు కొత్తగా ప్రధానిగా అయిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ తో కూడా సమావేశం కానున్నారు. మోడీ – రిషి ల సమావేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దౌత్య పరంగా పలు అంశాలపై , భారత్ – బ్రిటన్ సంబంధాలపై చర్చించనున్నారు. మోడీ – రిషి ల సమావేశం తర్వాత భారత్ – బ్రిటన్ ల బంధం మరింతగా బలపడటం ఖాయమని భావిస్తున్నారు.