విజయవాడ కనకదుర్గమ్మ వారికి 365 రకాల బియ్యంతో నిత్యనైవేద్యం అందించడానికి ముందుకు వచ్చారు ఎన్నారై కోమటిరెడ్డి మౌనిక రెడ్డి ( న్యూజెర్సీ ) . ప్రతీ రోజు 50 కిలోల చొప్పున నిత్యనైవేద్యం చేస్తారు. అది కూడా దేశవాళీ బియ్యంతోనే చేస్తారు. అయితే ఆ బియ్యాన్ని అమ్మవారికి అందించడానికి ముందుకు వచ్చారు మౌనిక రెడ్డి.
అమ్మవారిని కొలిచే భాగ్యం ఇలా నాకు లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రమాదేవి , రైతు బాపారావు , వేదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి , మౌనిక రెడ్డి కుటుంబ సభ్యులు , ఇతరులు పాల్గొన్నారు.