23.3 C
India
Wednesday, September 27, 2023
More

    అమెరికాలో రోడ్డు ప్రమాదం : హైదరాబాద్ వాసుల మృతి

    Date:

    అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా ఆ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంచలన సంఘటన చికాగో సమీపంలోని అలెగ్జాoడర్ కౌంటీ వద్ద జరిగింది. గురువారం తెల్లవారు ఝామున 4.15 ఈ రోడ్డు ప్రమాదం జరిగింది . పిక్నిక్ కు ఒక కారులో అయిదుగురు స్నేహితులు బయలుదేరారు. తెల్లవారు ఝాము కావడంతో కాస్త వేగంగా వెళ్తున్నారు.

    ఇక అంతకంటే వేగంగా ఎదురుగా మరో కారు వచ్చి బలంగా ఢీకొట్టడంతో భారీ యాక్సిడెంట్ అయ్యింది. దాంతో అక్కడికక్కడే పీచెట్టి వంశీకృష్ణ (23) , స్వర్ణ పవన్ (23) చనిపోయారు. ఇక ఇదే కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు స్నేహితులు కళ్యాణ్ , కార్తీక్ , శ్రీకాంత్ లకు గాయాలు అయ్యాయి. దాంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళు హైదరాబాద్ లోని నిజాం పేట కు చెందిన వాళ్ళు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

    Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

    Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

    Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

    Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

    Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related