అగ్రరాజ్యం అమెరికాలో ఘోర విషాదం నెలకొంది. తెలుగు విద్యార్ధిని అత్యంత దారుణంగా హత్య చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వీర సాయిష్ ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్ళాడు. అయితే ఒకవైపు చదువుకుంటూనే కొలంబస్ ఫ్రాంక్లింటన్ లోని ఓ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.
అయితే గ్యాస్ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న సమయంలో ఓ ఇద్దరు దుండగులు స్టేషన్ లోకి చొచ్చుకొని వచ్చి సాయిష్ పై కాల్పులు జరిపి గ్యాస్ స్టేషన్ లో ఉన్న నగదు దోచుకొని వెళ్లారు. కాల్పుల్లో గాయపడిన సాయిష్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దాంతో సాయిష్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అములుకున్నాయి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సాయిష్ అర్దాంతరంగా తనువు చాలించడంతో సాయిష్ కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది.