వర్జీనియాలో టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ నరేంద్ర పర్యటించారు. వర్జీనియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతు లేకుండా పోయిందని, ఏపీ దివాళా తీసిందని, రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో మునిగిపోయిందని జగన్ సర్కారు పై దుయ్యబట్టారు.
ఏపీ అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని, రాష్ట్రం మరో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని….. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనమంతా కలిసి కట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వివిధ దేశాలలో ఉంటున్న తెలుగు వాళ్లంతా ఏపీ పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని అందుకు వర్జీనియా లో ఉంటున్న వాళ్ళు కూడా నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.