షిరిడీ సాయిబాబా ఆలయానికి మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వ్యక్తికి ప్రెసిడెంట్ పదవి లభించింది. షిరిడీ సాయిబాబాకు ప్రత్యక్షంగా సేవలు అందించాలని తహతహలాడే భక్తులు కోట్లాదిమంది ఉంటారు. అయితే ఆ అదృష్టం అందరికీ దక్కదు. కానీ ఆ అరుదైన అవకాశం , అదృష్టం తెలుగు వ్యక్తి అయిన యార్లగడ్డ సుధాకర్ ను వరించింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన యార్లగడ్డ సుధాకర్ న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. జడ్జిగా వ్యవహరిస్తున్న తనకు షిరిడి సాయిబాబా ఆలయ ట్రస్ట్ అధ్యక్ష బాధ్యతలు లభించడం ఆనందంగా ఉందన్నారు. తనకు లభించిన ఈ అవకాశాన్ని భక్తులకు మరింత మెరుగైన సేవల కోసం వినియోగిస్తానన్నారు. ఇక ఒక తెలుగు వ్యక్తికి ఆలయ ట్రస్ట్ అధ్యక్ష పదవి లభించడం పట్ల పలువురు తెలుగువాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ యార్లగడ్డ సుధాకర్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.