
vijay devarkonda : టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మెట్ల మీద నుంచి దిగుతుండగా.. కాలు స్లిప్ కావడవంతో జారీ పడ్డాడు. ఈ సంఘటనుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారగా, రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఆందోలన చెందుతున్నారు. విజయ్ దేవర కొండ కిందపడిన వెంటనే స్టాఫ్ అంతా సురక్షితంగా లేపి బయటకు తీసుకెళ్లారు. ఇక, ఈ వీడియో వైరల్ అవుతండడంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా కంగారు పడుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు. విజయ్ దేవర కొండ ఓ పాప్ గాయనితో ప్రైవేట్ ఆల్బమ్ చేయబోతున్నాడని గత నాలుగైదు రోజులుగా అటు మెయిన్ స్ర్టీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా, విజయ్ జారి పడిన ఘటన ఘటన ముంబైలోని మితిబాయి క్షితిజ్ లో జరిగింది. ‘సాహిబా’ ఆల్బమ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండకు ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఆల్బమ్లో విజయ్ దేవరకొండ సరసన రాధిక మోహన్ నటిస్తున్నదని తెలుస్తున్దని. ఇప్పటికే రాధికా- పాప్ సింగర్ జస్లీన్ రాయల్ కాంబినేషన్లో ఓ పాట వచ్చిన సంగతి తెలిసిందే . అదే ‘నై జానా’ సాంగ్. ఇది సంచలన విజయాన్ని అందుకుంది. విజయ్ కూడా ఈ పాప్ సింగర్ తో .జత కడుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక ఈ పాట సంచలనం సృష్టిస్తుంచడం ఖాయమని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన లుక్ విడుదల చేయగా, తెగ ఆకట్టుకుంటున్నది. నవంబర్ 15న ఈ ఆల్బమ్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ టాక్.