
అధికార వైసీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటు చేసినట్లుగా అనుమానిస్తూ ఆ నలుగుర్ని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆమేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. నలుగురు ఎమ్మెల్యేలలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు.
అయితే నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , ఆనం రామనారాయణ రెడ్డి లను కొంతకాలం కృతమే పార్టీ దూరం పెట్టింది. దాంతో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఉండవల్లి శ్రీదేవి గతకొంత కాలంగా వైసీపీ అధినేత పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇక ఇటీవలే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నియోజకవర్గంలో మరొక వ్యక్తి జోక్యం చేసుకోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తమ అసంతృప్తిని ఇలా వెళ్లగక్కారు. అయితే చంద్రబాబు దగ్గర కోట్లాది రూపాయలు తీసుకునే ఆపార్టీకి అనుకూలంగా ఓటు వేశారని సజ్జల ఆరోపిస్తున్నాడు.






