భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా సమావేశం పెదవడ్ల పూడి లో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పాటి బండ్ల రామకృష్ణ అధ్యక్షత వహించగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ గుంటూరు జిల్లా కార్యదర్శి, యు బ్లడ్ కన్వీనర్ , పాతురి నాగభూషణం కూడా ఈ సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉత్తేజితులను చేసేలా ప్రసంగించారు. అనంతరం సాయి బాబా డైరీ లను అందజేశారు. గోశాలను సందర్శించారు.