
వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైకాపా ( వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ) లో ఎమ్మెల్యేలు అంతా బానిసల్లా ఉన్నారని , సమయం కోసం ఎదురు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్రిస్తుందన్నాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఈ దేశంలోనే పెద్ద మిస్టరీగా మారిందని , ఇదంతా ప్రజలకు అర్థమైందని జగన్ గట్టిగా బుద్ధి చెప్పే సమయం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నాడు.
చంద్రబాబు వ్యాఖ్యలు అధికార వైకాపా లో సంచలనం సృష్టించాయి. దాంతో వైకాపా నాయకులు చంద్రబాబు వ్యాఖ్యలను దుయ్యబడుతున్నారు. జగన్ ను ఓడించడం ఎవరి తరం కాదని , చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






