ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ 20 సమావేశంలో. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో డిసెంబర్ 5 న జీ 20 సమావేశం జరిగింది. కాగా ఆ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ను కూడా ఆహ్వానించింది. ఈ సమావేశంలో చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మోడీతో సమావేశానికి ముందు అలాగే తర్వాత కూడా భేటీ అయ్యారు బాబు.
అలాగే పలువురు కేంద్ర మంత్రులు చంద్రబాబుతో ముచ్చటించడం విశేషం. రాజ్ నాథ్ సింగ్ , నిర్మలా సీతారామన్ , పీయూష్ గోయల్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఇక చాలాకాలం తర్వాత మోడీ – చంద్రబాబు లు కలవడంతో జాతీయ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తెలుగు తమ్ముళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అయితే చంద్రబాబు కు ఘన స్వాగతం లభించిందని ఊదరగొట్టాయి. మొత్తానికి చంద్రబాబు కు అయితే కేంద్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ……. చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు మాజీ ….. అయినప్పటికీ ఆయనకున్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించిన మోడీ చంద్రబాబు కు ఆహ్వానం పలికారు. చంద్రబాబు ఈరోజు కూడా ఢిల్లీ లోనే ఉండనున్నారు.
పలువురు నాయకులను కలవనున్నారు. చంద్రబాబు కు జీ20 సమావేశంలో గౌరవం లభించడంతో 2024 లో జరుగబోయే ఏపీ ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ పొత్తు ఖాయం కానుందా ? అనే చర్చలు జరుగుతున్నాయి.