తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును ఎంత త్వరగా జైలుకు పంపితే అంతగా తనకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాడట జగన్.
అందుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ని బూచిగా వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ దేశంలోనే అత్యంత పెద్దదైన అవినీతి అంటూ జగన్ నిండు సభలో పేర్కొన్నాడు. అంతేకాదు ఈ స్కామ్ కు సూత్రధారులైన వాళ్ళు ఎంతటి పెద్ద హోదాలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడు.
అంటే ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ను అడ్డుగా పెట్టుకొని చంద్రబాబుపై ఆరోపణలు చేసి జైలుకు పంపించాలని కసిగా ఉన్నారట. అయితే అది కుంభకోణమే కాదు. డబ్బులు చేతులు మారలేదు …… ఏమాత్రం అవగాహన లేకుండా వైసీపీ వాళ్ళు అధికార మదంతో మాట్లాడుతున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. నారా చంద్రబాబును , నారా లోకేష్ ను టార్గెట్ చేయాలని జగన్ సర్కారు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని అయితే ఎన్ని కుట్రలు పన్నినా జగన్ లక్ష్యం నెరవేరదని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు.