కర్నూల్ జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవం కోసం పోలీసులు భారీ భద్రత కల్పించారు. దసరా వేడుకలలో భాగంగా దేవరగట్టులో ఉత్సవ విగ్రహం కోసం కర్రలతో సమరం జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ కర్రల సమరంలో పది గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దాదాపు 2 లక్షల మంది చూడటానికి తరలివచ్చారు.
ఇక కర్రలతో దాడులు చేసుకోగా ఈ దాడులలో 80 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. చాలా సంవత్సరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సంప్రదాయంగా కొనసాగుతుండటంతో ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఈ ఉత్సవాన్ని ఆపలేకపోతున్నాయి. ఉత్సవ విగ్రహం తమకే దక్కాలనే ఆరాటంలో కర్రలతో పోరాటం చేస్తుంటారు. దెబ్బలను సైతం లెక్కచేయకుండా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. కాగా నిన్నటి సంఘటనలో 80 మందికి గాయాలు అయ్యాయి దాంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించారు.