మాజీమంత్రి వట్టి వసంతకుమార్ ( 70 ) ఈరోజు తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వట్టి వసంతకుమార్. విశాఖపట్నం లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్యం విషమించడంతో ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. దాంతో వట్టి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. వట్టి వసంతకుమార్ పశ్చిమ గోదావరి జిల్లాలోని పూండ్ల స్వగ్రామం దాంతో పార్దీవ దేహాన్ని స్వగ్రామానికి తరలించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లలో మంత్రిగా పలు కీలక శాఖలను నిర్వహించారు వట్టి.
Breaking News