
బ్రేకింగ్ న్యూస్…… ఏపీ అసెంబ్లీలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. అధికార , ప్రతిపక్ష పార్టీల సభ్యులు టీడీపీ , వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ వాగ్వాదం పెరిగి ఏకంగా తన్నులాట వరకు వెళ్ళింది. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మధ్య గొడవ జరుగుతుండటంతో అటు టీడీపీ ఇటు వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యులకు మద్దతుగా వచ్చారు. దాంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలకు గాయాలు కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాపై అసెంబ్లీలో దాడి జరిగిందని టీడీపీ అంటుంటే లేదు లేదు మాపైనే టీడీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని వాదనకు దిగుతోంది వైసీపీ.






