తెలుగుదేశం పార్టీని స్థాపించి 41 సంవత్సరాలు అవుతుండటంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ లో కూడా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్లమెంట్ హౌజ్ లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ విభాగం కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్. ఇక ఇదే సమయంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంట్ లోకి అడుగు పెట్టడంతో అతడికి కేక్ ఇచ్చి టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి తెలియజేసారు. దాంతో తెలుగుదేశం సభ్యులకు శుభాకాంక్షలు అందజేశాడు నడ్డా.
గతంలోని బీజేపీ – టీడీపీ పొత్తుల గురించి టీడీపీ సభ్యులు గుర్తు చేయగా ఆ విషయం తనకు బాగా తెలుసని స్పష్టం చేశాడు. ఇక లోక్ సభలో పలువురు ఎంపీలకు కేక్ అందించారు టీడీపీ ఎంపీలు.