23.8 C
India
Wednesday, March 22, 2023
More

    వివేకానంద రెడ్డి ఫ్యామిలీ జగన్ ను నాశనం చేయాలని చూసింది: కొడాలి నాని

    Date:

    Kodali nani sensational comments on viveka family
    Kodali nani sensational comments on viveka family

    వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం వైఎస్ జగన్ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి కొడాలి నాని. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని క్యాంప్ కార్యాలయంలో కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసాడు. కొడాలి నాని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వైఎస్ వివేకానంద రెడ్డి బ్రతికి ఉన్నా లేకపోయినా కడప ఎంపీ సీటు ఆయనకు ఇచ్చేవాడు కాదని , అవినాష్ రెడ్డికి మాత్రమే ఇచ్చేవాడని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేసినప్పుడు కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డితో పాటుగా ఆయన కుటుంబం జగన్ ను ఓడించడానికి , ఆయన్ని నాశనం చేయడానికి చూసిందని దుయ్యబట్టాడు.

    జగన్ పార్టీ అధినేత కాబట్టి పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలో ఆయన మాత్రమే నిర్ణయించుకుంటారని , జగన్ పోటీ చేసినప్పుడు అవినాష్ రెడ్డి తో పాటుగా ఆయన కుటుంబం జగన్ కు అండగా నిలిచిందని , కానీ వివేకానంద కుటుంబం మాత్రం జగన్ ను నాశనం చేయాలని చూసిందన్నాడు. అందుకే కడప ఎంపీ సీటు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చాడని అన్నాడు కొడాలి నాని. ఈ వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 2019 లో ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల ప్రచారం

    అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం...

    సైకో పోవాలి ….. సైకిల్ రావాలి

    సైకో ...... సైకో పోవాలి ...... సైకిల్ రావాలి అంటూ పండగ...

    సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న బై బై జగన్

    #byebyejaganin2024 అనే ట్యాగ్ లైన్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా...

    రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌

    అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక...