
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను జులై 11 కు వాయిదా వేసింది. అమరావతి తీర్పు పై స్టే ఇవ్వాలని జగన్ సర్కారు సుప్రీం కోర్టును పదేపదే అభ్యర్ధించినప్పటికీ సుప్రీం కోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు.
ఆంధ్రపద్రేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని , తక్షణమే పనులు చేపట్టాలని ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పు పై సుప్రీం కు వెళ్ళింది జగన్ సర్కారు. ఏపీ రాజధానిగా వైజాగ్ ను చేయాలని , అక్కడి నుండే పరిపాలన సాగించాలని భావిస్తోంది. దాంతో సుప్రీం ను ఆశ్రయించింది. హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని పదేపదే కోరినప్పటికీ సుప్రీం మాత్రం అందుకు అంగీకరించకుండా జులై 11 కు వాయిదా వేసింది.
అయితే జగన్ సర్కారు అమరావతి తీర్పు పై స్టే కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా అమరావతి రైతులు కూడా సుప్రీం తలుపు తట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆదేశాలు ఇవ్వాలని , హైకోర్టు తీర్పును యథాతధంగా అమలు పరచాలని కోరుతున్నారు. దాంతో ఇరువురి వాదనలను మరోసారి జులై 11 న విచారించనుంది సుప్రీం కోర్టు.






