ఈరోజు అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు హ్యాపీ బర్త్ డే జగన్ అంటూ సందడి చేసాయి. ఇక ఏపీలో అయితే అట్టహాసంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అభిమానులు , కార్యకర్తలు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ , ప్రతిపక్ష నాయకుడు , మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులంతా జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కానీ చెల్లెలు వైఎస్ షర్మిల మాత్రం అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు.
దాంతో అన్నా – చెల్లెలు మధ్య నిజంగానే అగాధం చోటు చేసుకుందా ? లేక రాజకీయ ఎత్తుగడలో భాగమా ? అనే చర్చ జరుగుతోంది. ఇటీవలే వైఎస్ షర్మిల పుట్టినరోజు జరిగింది. ఆ సమయంలో పలువురు షర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కానీ అన్నయ్య జగన్ మాత్రం విష్ చేయలేదు. కట్ చేస్తే ఈరోజు అన్నయ్య పుట్టినరోజు కావడంతో చెల్లెలు షర్మిల కూడా అదే పని చేసింది.
అయితే తల్లి వైఎస్ విజయమ్మ మాత్రం తన కొడుకును ఆశీర్వదించింది. హైదరాబాద్ లో షర్మిలతో కలిసి ఉంటున్న విజయమ్మ తనయుడి పుట్టినరోజు వేడుకల కోసం ఏపీలో అడుగు పెట్టింది. కొడుకును ఆశీర్వదించింది. అయితే ఎందరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినా అన్నయ్య వదిలిన బాణం మాత్రం విషెష్ చెప్పలేదు దాంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.