
గత ప్రభుత్వంలో టీడీపీతో కలిసి అధికారం పంచుకున్న బీజేపీ తర్వాత చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసి బీజేపీ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిన బీజేపీ ఎన్నికల తర్వాత వైసీపీ తో సఖ్యంగా ఉన్న బీజేపీ ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ ఒంటరి పోరుకే సిద్ధంగా ఉన్నామని చెబుతున్న సొంతంగా గెలవలేమని బీజేపీ నాయకులు లోలోన ఆందోళన చెందుతున్నారు..
దీనికి కారణం ఇటీవల సత్య కుమార్ పై రాళ్ల దాడే కారణంగా బీజేపీ శ్రేణులు చెబుతున్నారు. సత్య కుమార్ పై రాళ్ల జరిగిన రాళ్ల దాడిని బీజేపీ అధిష్టానం సీరియస్ గ తీసుకుందని రాళ్ల దాడికి రివేంజ్ తీసుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు నాయకులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ కి అన్ని విధలా అండగా ఉండేది బీజేపీ .. కానీ జాతీయ బీజేపీ పెద్దలు ఎప్పుడు ఏది అడిగినా కాదు రాజకీయంగా సాయం చేస్తూ వచ్చారు. అందుకే కేంద్రం నుంచి అడిగిన నిధుల రాకపోయినా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ బీజేపీ అడగక పోయినా బేషరతుగా మద్దతు ప్రకటించింది.. గత నాలుగేళ్ళుగా బీజేపీ, వైసీపీ మధ్య సన్నిత బంధం కొనసాగింది అన్నది బహిరంగ రహస్యమే..
ముఖ్యంగా కొన్ని కీలకమైన బిల్లుల విషయంలో రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకున్నా కేంద్ర పెద్దల మనసెరిగి వారు అడగక పోయినా మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని గట్టెక్కించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనధికార మైత్రి పై ప్రత్యర్ధులు అనేక రకాల విమర్శలు చేసేవారు. మొన్నటి వరకు సఖ్యంగా ఉన్న వైసీపీ, బీజేపీ మధ్య వైరం పెరిగిందా..? వైసీపీపై రాజకీయంగా బీజేపీ స్ట్రాటజీ మార్చిందా? అని ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.






