
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టించు కోవడం లేదు అనీ పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి.. వైఎస్ భాస్కర్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేసిన మరుసటి రోజులు వైఎస్ ఆవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసేందుకు నోటీసు ఇచ్చిన విషయం విధితమే..
అయితే ఇ కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. కోర్టు కేసును విచారించిన ఆయనను ఈ నెల 25 వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని కోర్టు బెయిల్ ఇచ్చింది…అయితే 25 వ తేదీన మళ్ళీ సుప్రీం కోర్టు మధ్యంత ర బెయిల్ పై విచారణ జరగనుంది అయితే ఈ కేసును ఈ నెల 31 లోగా విచారణ పూర్తి చేయాలనీ కోర్టు సీబీఐని ఆదేశించింది..
ఈ కేసులో అవినాష్ రెడ్డి కీలక కాబట్టి సీబీఐ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని వాదనలు వినిపించనుంది సోమవారం నాడు అవినాష్ బెయిల్ రద్దు చేస్తే అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇదే జరిగితే ఎం చెయ్యాలి అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది..
స్వతహాగా ఎవ్వరి మాట వినని జగన్ తెలుగుదేశం పార్టీ హయాంలో వివేకా మర్డర్ జరిగింది. అప్పటి సీఎం చంద్రబాబు సిట్ ను ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తరువాత సిట్ అధికారులను మర్చి మళ్లీ కొత్త అధికారులను నియమించింది జగన్ సర్కారు.. సిట్ అధికారులు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా జగన్ అవినాష్ రెడ్డి నిరపరాధి అని భావిస్తూ వస్తున్నాడు .. అందుకే జగన్ అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు ..
సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సొంత చిన్నాన్న ను హత్య కేసులో ఇన్ని రోజులు దోషులను వెనకేసుకు వచ్చాడు అనే భావన ప్రజల్లోకి వెళ్లి పార్టీకి తన వ్యక్తిగత ప్రతిష్ట కు భంగం కలిగే అవకాశం ఉందని గమనించిన జగన్ అవినాష్ రెడ్డిని దూరం పెడుతున్నాడని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి..






