ఈనెల 20 న ఢిల్లీ లో లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కోవాల్సి ఉన్నందున ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళింది. కవిత వెంట సోదరులు మంత్రి కేటీఆర్ , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ లు కూడా వెళ్లారు. మర్చి 11 న లిక్కర్ స్కామ్ లో ఈడీ ముందు విచారణకు హాజరైంది కవిత.
ఆరోజు దాదాపు 9 గంటల పాటు కవితను విచారించింది ఈడీ. అయితే మళ్ళీ మార్చి 16 న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే కవిత మార్చి 16 న డుమ్మా కొట్టింది. తన లాయర్ చేత ఈడీ కోరిన డాక్యుమెంట్లు పంపించింది. దాంతో ఈనెల 20 న విచారణకు రావాల్సిందిగా కోరింది ఈడీ.
రేపటి విచారణ కోసమే కవిత ఢిల్లీ వెళ్లినప్పటికీ , ఈడీ ముందు విచారణకు హాజరు అవుతుందా ? లేదా ? అన్నది రేపు ఉదయం 11 గంటలకు కానీ తెలియదు. అయితే ఢిల్లీలో ఉండాలి కాబట్టి అలాగే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలి కాబట్టి ఢిల్లీకి వెళ్ళింది కవిత. రేపు విచారణకు హాజరు అవుతుందా ? ఎలాంటి ప్రశ్నలు ఈడీ సంధిస్తుంది ? తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయి ? అన్నది ఉత్కంఠగా మారింది.