
చెల్లి కవిత కోసం మరోసారి ఢిల్లీ వెళ్తున్నాడు అన్న కేటీఆర్. రేపు ఈడీ మరోసారి ఎమ్మెల్సీ కవితను విచారించనున్న విషయం తెలిసిందే. కవిత ఈడీ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా తనకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో రేపటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో కవిత కోసం అన్న కేటీఆర్ మరోసారి హస్తినాపురం వెళ్లనున్నాడు.
ఈనెల 11 న ఈడీ విచారణకు హాజరైంది కవిత. ఆరోజు ఏకంగా 9 గంటల పాటు విచారించింది ఈడీ. ఆ సమయంలో కేటీఆర్ , హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు….. కవితకు అండగా నిలిచారు. ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోంది. కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడు. అలాగే హరీష్ రావు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.






