తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న సుఖేశ్ చంద్రశేఖర్ తాజాగా మరో సంచలనానికి తెరలేపాడు. ఎమ్మెల్సీ కవిత తో తాను జరిపిన వాట్సాప్ చాట్ అంటూ లీక్ చేసాడు. ఆ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎమ్మెల్సీ కవితను అక్కా అంటూ సంభోదించాడు సుఖేశ్. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ల విషయం కూడా ఇందులో ప్రస్తావించడం గమనార్హం. డబ్బులను నెయ్యితో పోల్చారు. 15 కేజీ ల నెయ్యి ఆఫీసులో ap అనే వ్యక్తి కి ఇచ్చాను అంటూ కోడ్ భాష వాడారు ఇద్దరూ. మూడు దఫాలుగా కోట్లాది డబ్బు చేతులు మారినట్లుగా సుఖేశ్ ఆరోపిస్తున్నాడు.
అయితే సుఖేశ్ ఇప్పుడు జైలులో ఉన్నాడు. జైలులో ఉండి కూడా ఇలా మీడియాకు వివరాలు అందజేస్తుండటంతో గులాబీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుఖేశ్ చంద్రశేఖర్ పచ్చి మోసగాడు అలాంటి వాడి ఆరోపణలు పట్టించుకుంటామా ? ఇది బీజేపీ ఆడుతున్న డ్రామా అంటూ కొట్టి పడేస్తున్నారు.