మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. వెంటనే సీబీఐ విచారణ అధికారిని మార్చాలని లేదంటే మరొక అధికారిని కూడా జతగా నియమించాలని అందుకు ఈనెల 29 వరకు సీబీఐ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్నామని , తదుపరి విచారణ ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.
వివేకానంద రెడ్డి హత్య కేసు సరైన దిశలోనే దర్యాప్తు జరుగుతోందని , విచారణ అధికారిని మార్చాల్సిన అవకాశం లేదని సీబీఐ తరుపు లాయర్ వాదించారు. అయితే సీబీఐ తరుపు లాయర్ వాదనలను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. విచారణకు ఎంత సమయం కావాలి….. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 10 కి వాయిదా వేసింది. సీబీఐ దర్యాప్తు అధికారిని మార్చాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది.