ఖమ్మం పార్లమెంట్ లోక్ సభ స్థానానికి పోటీ పడి 2014 లో విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. ఆ తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఏదో ఒకటి వస్తుందని అనుకున్నాడు కానీ ఇవ్వలేదు. దాంతో అప్పటి నుండి ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు.
చివరకు ఇక కేసీఆర్ పంచన ఉండటం కంటే కాషాయ దళం లో చేరితే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట. దాంతో అధినేత కేసీఆర్ పై అలాగే కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట పొంగులేటి. అయితే మీడియా ముందు వాళ్ళను ఏమి అనడం లేదు కానీ తన సన్నిహితుల వద్ద మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడట. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని గులాబీ బాస్ కు షాక్ ఇస్తూ కాషాయ దళంలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.