ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. కవిత ను 7 గంటలుగా విచారిస్తోంది. ఢిల్లీ లోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో భాగంగా పలు ప్రశ్నలు సంధించిన ఈడీ మరిన్ని వివరాల కోసం కవిత మొబైల్ ను స్వాధీనం చేసుకుంది.
కవిత వాడుతున్న మొబైల్ ఫోన్ మొదట తన వెంట ఈడీ కార్యాలయానికి తీసుకు రాలేదు. దాంతో ఇంటి దగ్గర ఉన్న ఫోన్ ను తీసుకు రావాల్సింగా ఈడీ కోరడంతో తన డ్రైవర్ చేత మొబైల్ ఫోన్ ని తెప్పించింది. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంకు వచ్చింది కవిత. ఆ తర్వాత కొద్దిసేపటికే కవిత విచారణ ప్రారంభమైంది. ఇప్పటికి 7 గంటలు దాటింది. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.