
హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. ఈరోజు తెల్లవారుఝాము నుంచే భారీ ఈదురు గాలులతో , ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. దాంతో హైదరాబాద్ నగర రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైటెన్షన్ వైర్లు బంజారాహిల్స్ లో నేలకొరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , మణికొండ , షేక్ పేట , గచ్చిబౌలి , మాదాపూర్ లతో పాటుగా హైదరాబాద్ నగరమంతా జోరున వర్షం కురిసింది. అంతేకాదు రాబోయే 3 గంటల్లో భారీ ఉరుములు , పిడుగులతో భారీ వర్షం పడుతుందని వాతారవరణ శాఖ హెచ్చరించింది. దాంతో ఉద్యోగులు ఇళ్ల నుండి ఆఫీసులకు వెళ్లడం కష్టంగా మారింది. తెలంగాణలో భారీ వర్షాలు పడుతుంటే ఏపీలో మాత్రం ఎండలు మండుతున్నాయి. దాంతో విచిత్రకరమైన పరిస్థితి ఏర్పడింది.






