మూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో క్రికెట్ టి- 20 మ్యాచ్ జరుగుతుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలని వేలాది రూపాయలు పెట్టి బ్లాక్ లో కూడా టికెట్లు కొన్నారు. అంతేనా రోజుల తరబడి క్యూ లైన్లో వేచి ఉండి మరీ టికెట్లు సంపాదించారు. ఇంత కస్టపడింది ఎందుకో తెలుసా …… ఆటను ఆస్వాదించాలని.
అలా కష్టపడిన వాళ్లకు పైసా వసూల్ ఆట అయ్యింది నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్. మూడు మ్యాచ్ లలో సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ అలాగే భారత్ మరొక మ్యాచ్ గెలవడంతో హైదరాబాద్ లోని ఉప్పల్ లో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తే వాళ్లదే సిరీస్ కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి నిన్నటి మ్యాచ్ చూసిన వాళ్లకు జీవితాంతం గుర్తుండిపోయే మ్యాచ్ అయ్యింది.
బౌలింగ్ లో అలాగే బ్యాటింగ్ లో కూడా భారత్ ఆటగాళ్లు అదరగొట్టారు. దాంతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించారు ప్రేక్షకులు. ఇక సూర్యకుమార్ యాదవ్ , కింగ్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో భారత్ సునాయాసంగా ఈ మ్యాచ్ గెలవడమే కాకుండా సిరీస్ ని కూడా సొంతం చేసుకుంది.