ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అడ్డాకు వస్తున్నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 5 వ విడత ముగింపు సభ ఈరోజు కరీంనగర్ లో జరుగనుంది. దాంతో ఈ ముగింపు సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా వస్తున్నాడు. కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే సంకేతాలు వెలువెడుతున్న నేపథ్యంలో 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్ర అయ్యాక మిగతా నియోజకవర్గాలను త్వరగా పూర్తి చేయాలంటే పాదయాత్ర చేయడం వల్ల సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. దాంతో ఈ సభ అయ్యాక పార్టీ ముఖ్యులతో కూర్చొని బస్సు యాత్ర చేపట్టాలని …… అందుకు రూట్ మ్యాప్ రెడీ చేయాలనీ భావిస్తున్నారట.