లైగర్ చిత్రానికి పెట్టుబడులు పెట్టింది కవిత అంటూ సంచలన ఆరోపణలు చేసాడు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. పూరీ జగన్నాథ్ , ఛార్మి లు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సమయంలో కవిత వాళ్ళపై కేసు లేకుండా చేసిందని , అలా వాళ్ళు పరిచయం కావడంతో తాను అక్రమంగా సంపాదించినా సొమ్మును లైగర్ చిత్రానికి పెట్టుబడిగా పెట్టిందని తీవ్ర ఆరోపణలు చేసాడు.
ఇక విజయ్ దేవరకొండ కూడా కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడం కూడా కవిత పెట్టుబడులు పెట్టడానికి మరో కారణం అని అంటున్నాడు. గతంలో విజయ్ దేవరకొండ కేసీఆర్ సర్కారుకు మద్దతుగా నిలిచాడని , పలుమార్లు సోషల్ మీడియాలో కేసీఆర్ సర్కారుపై ప్రశంసలు కురిపించాడని ఆరోపిస్తున్నాడు జడ్సన్. అందుకే కవిత పై దర్యాప్తు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరుతున్నాడు. మరి ఈ ఆరోపణలపై టీఆర్ఎస్ శ్రేణులు అలాగే కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.