భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెలలోనే ఏపీలో పర్యటించనున్నాడు. వైజాగ్ లో ఈనెలలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులకు అండగా ఉంటామని చాటి చెప్పడానికే ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో ఏపీలో కొన్ని స్థానాల్లోనైనా బలపడాలని కేసీఆర్ వ్యూహం పన్నాడట. దాంతో ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా ఉద్యమం చేస్తే తప్పనిసరిగా ఏపీ ప్రజల్లో సానుకూల పవనాలు వస్తాయని తద్వారా అక్కడ కూడా భారత్ రాష్ట్ర సమితికి ఓట్లు వస్తాయని నమ్మకంగా ఉన్నాడట.
ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసీఆర్ పర్యటించాడు. ఇక ఇప్పుడు అతడి దృష్టి ఏపీ మీద పడింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రులను ఘోరంగా తిట్టాడు కేసీఆర్. దాంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే అలాంటి వ్యతిరేకత ఎదురు కాకుండా విశాఖ ఉక్కు కర్మాగారం అంశాన్ని ఎంచుకున్నాడు తెలివిగా. మరి ఆ అంశం కేసీఆర్ కు సహకరించేలా చేస్తుందా ? లేదా ? అన్నది మీటింగ్ అయ్యాక కానీ తెలియదు.