
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత , భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనని అప్రతిష్ట పాలు చేయడానికే కొంతమంది పని గట్టుకొని పార్టీ మారుతున్నట్లుగా మీడియాలో అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని , నా రక్తంలోనే కాంగ్రెస్ ఉందని నేను పార్టీ మారడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఇటీవల కాలంలో వరుసగా ప్రధాని మోడీ , హోం మంత్రి అమిత్ షా లతో భేటీ అయ్యాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దాంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అలాగే గతకొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. దాంతో భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయమని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ఊహాగానాలు చెలరేగాయి. దాంతో పార్టీ మార్పు పై వస్తున్న వార్తలను ఖండించాడు. పార్టీ కార్యకర్తలను నిత్యం కలుస్తూనే ఉన్నానని , బుధవారం రోజున సోనియా గాంధీతోనే ఉన్నానని స్పష్టం చేసాడు.






