సోషల్ మీడియాలో కేటీఆర్ , బండి సంజయ్ ట్వీట్లు వైరల్ గా మారాయి. ఇంతకీ కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …….. …… ” ఆదాయం: అదానీకి !
వ్యయం : జనానికి , బ్యాంకులకు !
అవమానం : నెహ్రూకి!
రాజపూజ్యం : గుజరాతీ గుంపుకి!!
బస్ , బభ్రాజీమానం భజగోవిందం !
దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం !
అంటూ భారతీయ జనతా పార్టీని మోడీపై సెటైర్ వేసాడు మంత్రి కేటీఆర్.
ఇక దీనికి బండి సంజయ్ కూడా తక్కువేమి తినలేదు ……. గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి
అవమానం : ఉద్యమ వీరులకు , అమరుల త్యాగాలకు
రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు , దొంగలకు !!
తుస్ ….. పిట్టలదొర , తుపాకి చంద్రుల గడీల పంచాయితి లెక్క తేలుడే తరువాయి …… పతనం ఇగ షురువాయే. అంటూ కేసీఆర్ సర్కారును విమర్శిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు బండి. ఇక ఈ రెండు ట్వీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేటీఆర్ ను సమర్ధించే వాళ్ళు కొందరైతే బండి సంజయ్ ను సమర్ధించే వాళ్ళు మరికొందరు. మొత్తానికి ఉగాది రోజున పంచాంగం లెవల్లో కౌంటర్లు బాగానే పేలాయి.