ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈరోజు కూడా ఎమ్మెల్సీ కవితను విచారించనుంది ఈడీ. నిన్న పది గంటలకు పైగా కవితను విచారించింది ఈడీ. దాంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఓ దశలో కవితను అరెస్ట్ చేశారా ? అనే అనుమానం తలెత్తింది ఎందుకంటే …… మహిళా డాక్టర్ ఈడీ కార్యాలయానికి రావడంతో ఈ ఊహాగానాలు చెలరేగాయి.
నిన్న రాత్రి 9 గంటల తర్వాత ఈడీ కార్యాలయం నుండి కవిత బయటకు రావడంతో గులాబీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈరోజు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని విచారించనుంది. దాంతో కవితను కూడా ఈరోజు విచారించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోనుంది. దాంతో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.