ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. కాగా మొత్తం పదిన్నర గంటలకు పైగా విచారణ సాగింది. గంట గంటకు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అరెస్ట్ చేస్తారా ? పంపిస్తారా ? అనే టెన్షన్ నెలకొన్న నేపథ్యంలో మొత్తానికి కవిత విచారణ ముగియడంతో రాత్రి 9 గంటకు తర్వాత ఈడీ కార్యాలయం నుండి బయటకు రావడంతో గులాబీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కవితను మరోసారి మార్చి 24 న విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా మరో నోటీసు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Breaking News