తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ టూర్ మరోసారి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్ మాత్రం యధావిధిగా కొనసాగనుంది. గత నెలలో మోడీ తెలంగాణలో పర్యటించాల్సి ఉండే కానీ రకరకాల కారణాల వల్ల ఆ టూర్ క్యాన్సిల్ అయ్యింది. జనవరికి బదులుగా ఫిబ్రవరి 13 న తెలంగాణ లో పర్యటించడానికి నిర్ణయించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో కూడా మోడీ పర్యటన రద్దు అయ్యింది.
అయితే ఇదే సమయంలో అమిత్ షా పర్యటన మాత్రం ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 11 న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నాడు. బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ మీద దృష్టి సారించిన విషయం తెలిసిందే. బీజేపీ శ్రేణులను మరింతగా ఉత్సాహ పరచడానికి బీజేపీ అగ్ర నాయకత్వం పలుమార్లు పర్యటిస్తోంది. తెలంగాణ లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.