
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాత అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. రేవంత్ రెడ్డికి ఒక్కగానొక్క కూతురు నైమిషా. ఆమె వారం రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి తన మనవడిని చూడలేదు.
ఇక ఈరోజు వీలు చూసుకొని తన మనవడిని కలుసుకున్నాడు. తన మనవడికి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంకేముంది రేవంత్ రెడ్డి పోస్ట్ వైరల్ గా మారింది. నిత్యం రాజకీయాలతో సతమతం అయ్యే రేవంత్ రెడ్డి తన మనవడి రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి వారసుడు వచ్చాడన్న మాట. మొత్తానికి వారసుడి రాకతో తాతయ్య రేవంత్ రెడ్డి మహా సంబర పడుతున్నాడు.






